News September 28, 2024

రూ.1000 కోట్లతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి: మంత్రి

image

AP: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను రూ.1000 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. అమరావతిలో రూ.500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. సంగమేశ్వరం, అఖండ గోదావరి, శ్రీశైలం, సూర్యలంక బీచ్ ల రూపురేఖలు మారుస్తామని చెప్పారు. అక్టోబర్ 15 నాటికి DPRలు సిద్ధం చేసి రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News September 28, 2024

నేడు రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డా

image

TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రానికి రానున్నారు. తొలుత ఆయన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హరిత ప్లాజాలో పార్టీ MLAలు, MLCలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై సూచనలు చేయనున్నారు. ఖైరతాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఢిల్లీ బయలుదేరుతారు.

News September 28, 2024

ALERT: ఉరుములు, మెరుపులతో వర్షాలు

image

TG: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. రేపు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

News September 28, 2024

అక్టోబర్ 15 నుంచి ఇంటర్ క్వార్టర్లీ ఎగ్జామ్స్

image

AP: ఇంటర్ విద్యార్థులకు త్రైమాసిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఉ.9గంటల నుంచి 10.30 గంటల వరకు, సెకండియర్ వారికి ఉ.11 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.