News September 28, 2024
హైందవేతరుల కోసం తిరుమలలో బోర్డుల ఏర్పాటు
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే హైందవేతరులు పాటించాల్సిన నిబంధనల గురించి TTD బోర్డులు ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ATC సర్కిల్, గోకులం వద్ద బోర్డులు పెట్టింది. హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే శ్రీవారి పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్, అన్ని ఉప విచారణ కార్యాలయాల్లో పత్రాలు అందుబాటులో ఉంటాయంది.
Similar News
News September 28, 2024
GST on PETROL: హైకోర్టు సూచించినా కనీసం చర్చకు ఒప్పుకోని కేరళ CM, FM
లిక్కర్, పెట్రోల్ రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరులు కాబట్టే GSTలోకి తీసుకొచ్చేందుకు అంగీకరించడం లేదని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ అన్నారు. ‘పెట్రోల్ను GSTలో చేర్చేందుకు కౌన్సిల్లో చర్చించాలని నిరుడు కేరళ హైకోర్టు సూచించింది. అందుకు కేరళ CM, FM అంగీకరించనే లేదు. GSTలో దేనికైనా ఏకగ్రీవం తప్పనిసరి. సీఎంలూ ఒప్పుకోవాలి. అందుకే నాన్ బీజేపీ స్టేట్స్ కనీసం వ్యాట్ కూడా తగ్గించడం లేదు’ అని తెలిపారు.
News September 28, 2024
హర్షసాయి దేశం వదిలి వెళ్లకుండా చూడండి: బాధితురాలు
యూట్యూబర్ హర్షసాయిపై నమోదైన అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. అతడు దేశం వదిలి వెళ్లకుండా చూడాలని బాధితురాలు సైబరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసు జారీచేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని బాధితురాలు సీపీని కోరారు.
News September 28, 2024
PPF, SSY, పోస్టాఫీస్ స్కీమ్స్ వడ్డీరేట్లు తగ్గిస్తారా?
PPF, SSY, SCSS వంటి స్కీముల వడ్డీరేట్లను కేంద్రం 3 నెలలకోసారి రివ్యూ చేస్తుంది. పదేళ్ల G-Sec యీల్డుల కన్నా కనీసం 25BPS ఎక్కువ వడ్డీ ఇస్తుంది. ఇన్ఫ్లేషన్ తగ్గడంతో RBI రెపోరేట్ల కోత చేపట్టొచ్చని అంచనా. అప్పుడు G-Sec యీల్డులూ తగ్గుతాయి. దాంతో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ తగ్గిస్తారని విశ్లేషకుల అంచనా. అక్టోబర్లోనే రివ్యూ ఉంటుంది. మరి కేంద్రం వడ్డీని తగ్గిస్తుందో, పెంచుతుందో చూడాలి. మీ కామెంట్.