News September 28, 2024

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. మరో ఏడుగురికి ఊరట

image

AP: TDP కార్యాలయంపై దాడి కేసులో మరో ఏడుగురు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జగదీశ్, సుబ్బారావు, వినోద్, హరిబాబు, ఆంజనేయులు, షేక్ అమితా, రాజులపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడాన్ని బట్టి ఈ ఉత్తర్వులు కొనసాగుతాయంది. ఇప్పటికే అవినాశ్, అప్పిరెడ్డి, రఘురాం, ఒగ్గు గవాస్కర్‌లకు అరెస్ట్ నుంచి సుప్రీం ఊరట కల్పించింది.

Similar News

News January 18, 2026

ఇరాన్‌లో లీడర్‌షిప్ మారాలి: ట్రంప్

image

ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమైందని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ‘సిక్ మ్యాన్’గా సంబోధించిన ఆయన దేశాన్ని హింసతో కాకుండా గౌరవంతో నడపాలని హితవు పలికారు. దేశాన్ని సరిగ్గా ఎలా నడపాలో తన నుంచి నేర్చుకోవాలన్నారు. ఇరాన్ నేతల తీరు వల్ల ఆ దేశంలో సాధారణ ప్రజలు నివసించలేని పరిస్థితి నెలకొందన్నారు.

News January 18, 2026

OTTలోకి కొత్త సినిమాలు

image

ధనుష్, కృతిసనన్ జంటగా నటించిన ‘తేరే ఇష్క్ మే’ (తెలుగులో అమరకావ్యం) OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2025 NOV 28న విడుదలై రూ.150కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అటు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ‘మార్క్’ మూవీ ఈనెల 23 నుంచి జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ JAN 1న థియేటర్లలో రిలీజైంది.

News January 18, 2026

పితృ దేవతల అనుగ్రహం కోసం ఇలా చేయండి!

image

పితృ దోషాలు, పూర్వీకుల అనుగ్రహం పొందేందుకు మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యమైందని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి నదీ స్నానం ఆచరించాలి. ఉపవాసం ఉంటూ, మౌనవ్రతం పాటించాలి. జాతకంలో పితృ దోషాలు ఉన్నవారు నల్ల నువ్వులతో తర్పణం వదలాలి. పేదలకు అన్నదానం, వస్త్ర దానం, పెరుగు దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. పండితుడికి బూడిద గుమ్మడికాయ దానం చేయడం మంచిది’ అని సూచిస్తున్నారు.