News September 28, 2024
బాలయ్యకు ఐఫా పురస్కారం
నటసింహం నందమూరి బాలకృష్ణకు ఐఫా-2024 వేడుకల్లో అరుదైన పురస్కారం దక్కింది. నిన్న జరిగిన కార్యక్రమంలో ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు ఇచ్చే ముందు బాలకృష్ణ పాదాలకు కరణ్ నమస్కరించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి, వెంకటేశ్ సైతం హాజరయ్యారు.
Similar News
News October 15, 2024
క్యాబ్ డ్రైవర్ రాక్స్.. కస్టమర్ షాక్!
కస్టమర్ల ప్రవర్తనతో విసిగిపోయిన ఓ క్యాబ్ డ్రైవర్ కారులో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ వైరలవుతోంది. ‘నువ్వు క్యాబ్ ఓనర్ కాదు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఈ క్యాబ్ ఓనర్. కాబట్టి ఆయనతో గౌరవంగా, మర్యాదగా మాట్లాడండి. కారు డోర్ను జాగ్రత్తగా క్లోజ్ చేయండి. మీరు మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు. మీ యాటిట్యూడ్ను మీ జేబులో పెట్టుకోండి. భయ్యా అని పిలవకండి. వేగంగా వెళ్లాలని చెప్పకండి’ అని పోస్టర్లో రాసుంది.
News October 15, 2024
సజ్జలపై లుక్ అవుట్ నోటీసు ఉంది: DGP
AP: టీడీపీ ప్రధాన కార్యాలయం, గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసుల్ని CIDకి బదిలీ చేశామని DGP ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఓ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు ఉందని చెప్పారు. ‘తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో స్వతంత్ర దర్యాప్తు కోసమే స్పెషల్ టీమ్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు AP పోలీసులు, ఇద్దరు CBI, ఒక FSSAI అధికారి ఉంటారు. దీంట్లో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదు’ అని అన్నారు.
News October 15, 2024
దేవర మూవీ మరో రికార్డ్
కలెక్షన్లలో ‘దేవర’ మూవీ మరో ఘనత సాధించింది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 18రోజుల పాటు కనీసం రూ.కోటి చొప్పున వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. కొవిడ్ తర్వాత ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే అని పేర్కొన్నాయి. ఇటు సీడెడ్లో కలెక్షన్లు రూ.30 కోట్లు దాటాయి. దీంతో ఆ ఏరియాలో రూ.30 కోట్లు దాటిన 2 సినిమాలు ఉన్న వ్యక్తిగా NTR నిలిచారు. ఇప్పటి వరకు ఈ మూవీ రూ.510 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.