News September 28, 2024
మచిలీపట్నం-రేపల్లె లైన్కు గ్రీన్సిగ్నల్!
AP: దశాబ్దాలుగా దివిసీమ ప్రజలు ఎదురుచూస్తున్న మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ నిర్మాణంపై ముందడుగు పడింది. ఈ లైన్ ఆవశ్యకతపై ఎంపీ బాలశౌరి వివరణతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం మచిలీపట్నం నుంచి గుడివాడ, విజయవాడ మీదుగా తెనాలి చేరుకోవాలంటే 113KM ప్రయాణించాలి. కొత్త లైన్ పూర్తైతే దూరం తగ్గి చెన్నై, తిరుపతి ప్రాంతాలకు వెళ్లేందుకు సులువు అవడంతో పాటు సరకు రవాణా చేసుకోవచ్చు.
Similar News
News September 28, 2024
క్రికెటర్కు రోడ్డు ప్రమాదంపై అప్డేట్
యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ ముషీర్ ఖాన్ <<14215754>>రోడ్డు ప్రమాదంలో<<>> గాయపడటంపై BCCI స్పందించింది. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ప్రయాణించేందుకు డాక్టర్లు అనుమతిస్తే త్వరలోనే అతడు ముంబై వెళ్తాడని పేర్కొంది. అటు గాయం కారణంగా ముషీర్ ఖాన్ దాదాపు 16 వారాల పాటు క్రికెట్కు దూరమయ్యే ఛాన్సుంది.
News September 28, 2024
లడ్డూ వివాదంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
AP: లడ్డూ వివాదంపై ఎన్డీఏ ప్రభుత్వం సీరియస్గా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ రాజు అన్నారు. లడ్డూ తయారీ ఆరోపణల్లో నిజం ఉందన్నారు. అవసరమైతే విచారణలో కేంద్రం తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.
News September 28, 2024
ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ మృతి
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ & ఆర్ట్ డైరెక్టర్ రజత్ పొద్దార్ కన్నుమూశారు. బర్ఫీ, ఫైటర్, పఠాన్లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పనిచేశారు. తమ జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉండిపోతారని Tసిరీస్ ట్వీట్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. రజత్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆయన స్నేహితుడు అనీశ్ తెలిపారు. నిన్న కూడా ఎంతో ఆహ్లాదంగా మాట్లాడుకున్నామన్నారు.