News September 28, 2024

నేడు తిరుమలకు సిట్

image

AP: లడ్డూ వివాదం నేపథ్యంలో ఏర్పాటైన సిట్ ఇవాళ తిరుమలలో పర్యటించనుంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలోని బృందం టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశం కానుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై వివరాలు సేకరించనున్నారు.

Similar News

News September 28, 2024

WILLIAMSON: ప్చ్.. 4 గంటల్లో 2 సార్లు ఔటయ్యాడు

image

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 4 గంటల్లోనే రెండు సార్లు ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులే చేసిన కేన్ రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు వెనుదిరిగారు. ఉదయం 10.25 గంటలకు, మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులకే ఆలౌటైన కివీస్ ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 602/5కు డిక్లేర్ చేసింది.

News September 28, 2024

క్రికెటర్‌కు రోడ్డు ప్రమాదంపై అప్‌డేట్

image

యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ ముషీర్ ఖాన్ <<14215754>>రోడ్డు ప్రమాదంలో<<>> గాయపడటంపై BCCI స్పందించింది. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ప్రయాణించేందుకు డాక్టర్లు అనుమతిస్తే త్వరలోనే అతడు ముంబై వెళ్తాడని పేర్కొంది. అటు గాయం కారణంగా ముషీర్ ఖాన్ దాదాపు 16 వారాల పాటు క్రికెట్‌కు దూరమయ్యే ఛాన్సుంది.

News September 28, 2024

లడ్డూ వివాదంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

image

AP: లడ్డూ వివాదంపై ఎన్డీఏ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ రాజు అన్నారు. లడ్డూ తయారీ ఆరోపణల్లో నిజం ఉందన్నారు. అవసరమైతే విచారణలో కేంద్రం తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.