News September 28, 2024

విషాదం.. ఆవును కాపాడబోయి నలుగురు మృతి

image

ప.బెంగాల్‌లోని జల్పాయిగుడి జిల్లాలో విషాదం జరిగింది. ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడబోయి ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. నిన్న ఇంటి బయట నీటిలో పడి ఉన్న కరెంట్ వైర్ ఆవుకు తగలడంతో మిథున్ (32) దాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అతడికి షాక్ తగలడంతో తండ్రి పరేష్ (60), దీపాలి తల్లి (55) కాపాడేందుకు ప్రయత్నించారు. ఇలా ఆ ముగ్గురూ షాక్‌తో చనిపోయారు. దీపాలి చేతుల్లో ఉన్న మనవడు సైతం ప్రాణాలు వదిలాడు.

Similar News

News October 15, 2024

వ్యాయామం ఎంతసేపు చేయాలంటే?

image

ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం చేయాలి. కానీ రోజుకు ఎంత సేపు చేయాలి, ఎలా చేయాలనే దానిపై కొందరికి అవగాహన ఉండదు. వారంలో 5 రోజులపాటు గంట చొప్పున ఎక్సర్‌సైజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు అదుపులో పెట్టుకుని వ్యాయామం చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యి బరువు తగ్గుతారు. అలాగే నడక కూడా మన ఆరోగ్యం విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోజూ వీలైనంత దూరం నడక కొనసాగించాలి.

News October 15, 2024

RED ALERT: ఈ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారత వాతావరణ విభాగం (IMD) నేడు ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News October 15, 2024

నేటి నుంచి పాఠశాలల పున:ప్రారంభం

image

TG: తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు హాలిడేస్ ఇచ్చారు. 13 రోజుల పాటు సెలవులు కొనసాగాయి. ఇక జూనియర్ కాలేజీలు నిన్నటి నుంచి పున:ప్రారంభమయ్యాయి.