News September 29, 2024

కృష్ణా: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

Similar News

News January 22, 2026

గ్రీన్ క్లైమేట్ ఫండ్‌తో మత్స్యకారులకు అండ: కలెక్టర్

image

గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలో నిర్వహించిన సమీక్షలో అలంకార చేపలు, పీతల పెంపకం, సముద్ర నాచు యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు. లబ్ధిదారుల ఎంపిక, శిక్షణకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా మత్స్య సంపద పెంపుదల, ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News January 22, 2026

కృష్ణా: ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

image

కృష్ణా జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి లభించింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పల హారిక బుధవారం పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

News January 22, 2026

కృష్ణా: ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

image

కృష్ణా జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి లభించింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పల హారిక బుధవారం పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.