News September 29, 2024
KNR: నేడు ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభం
నేడు (ఆదివారం) కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 9:30 గం.లకి ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ సుచరిత తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 29, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ జగిత్యాలలో బాలసదనం నుండి బాలిక మిస్సింగ్. @ ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో వృద్ధురాలు మృతి. @ జ్వరంతో బాధపడుతున్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. @ పెగడపల్లి మండలంలో విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తి మృతి. @ రుద్రంగి మండలంలో డెంగ్యూ ఫీవర్ తో వ్యక్తి మృతి. @ జగిత్యాల జిల్లాలో ఇద్దరు ఎస్ఐల బదిలీ, ఇద్దరు ఎస్ఐలపై వేటు. @ సిరిసిల్లలో ఘనంగా పోషణ మాసోత్సవం. @ కొండగట్టులో భక్తుల రద్దీ.
News September 28, 2024
కరీంనగర్: కాంగ్రెస్పై బండి సంజయ్ హాట్ కామెంట్స్
కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మూసీ హైడ్రా కూల్చివేతలు, 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు నిధుల అంశాలే కాంగ్రెస్ కొంప ముంచబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కాంగ్రెస్ తలగొక్కోంటోందని, ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
News September 28, 2024
కరీంనగర్: రోడ్లకు మరమ్మతులు చేపట్టండి: కలెక్టర్
భారీవర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, పైపులైన్లు, కల్వర్టులకు మరమ్మత్తులు చేయించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్, ఎన్పీడీసీఎల్ తదితరశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆగస్టు 31 నుంచి ఈనెల 8 వరకు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలన్నారు.