News September 29, 2024

పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన ఖరారు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్టోబర్ 3న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 2న సా.4గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సా.5కి అలిపిరికి, అక్కడి నుంచి కాలినడకన బయల్దేరి రా.9కి తిరుమల చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి 3వ తేదీన ఉదయం స్వామి వారిని దర్శించుకుంటారు. సాయంత్రం తిరుపతిలో జరిగే వారాహి సభలో పాల్గొంటారు.

Similar News

News September 29, 2024

బ్యాడ్‌న్యూస్.. పెరిగిన చికెన్ ధర

image

నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర మళ్లీ పెరుగుతోంది. ఈనెల మొదట్లో కేజీ చికెన్ స్కిన్‌లెస్ రేట్ రూ.160-180 మధ్య పలికింది. 2 వారాల కిందట అది రూ.200 దాటగా గత వారం రూ.236కు చేరింది. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్‌లెస్ రేట్ రూ.243గా ఉంది. దసరా పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చికెన్ రేట్ మీ ప్రాంతంలో ఎంత ఉంది?

News September 29, 2024

ఇజ్రాయెల్ లెక్క సరి చేసింది: నెతన్యాహు

image

హెజ్బొల్లా చీఫ్ న‌స్ర‌ల్లా మ‌ర‌ణంతో ఇజ్రాయెల్ ‘లెక్క సరి’ చేసింద‌ని ఆ దేశ ప్రధాని నెత‌న్యాహు పేర్కొన్నారు. న‌స్ర‌ల్లా మ‌ర‌ణం అనంతరం ఆయ‌న మొద‌టిసారి ప్ర‌క‌టన ఇచ్చారు. ఎంద‌రో ఇజ్రాయెలీలు, అమెరిక‌న్లు, ఫ్రెంచ్ పౌరుల హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన సామూహిక హంత‌కుడిని అంతం చేసి ఇజ్రాయెల్ లెక్క సరి చేసిందన్నారు. తమ లక్ష్య సాధనకు న‌స్ర‌ల్లా మరణం అవసరమని పేర్కొన్న నెతన్యాహు ఇదొక చారిత్రక మ‌లుపుగా అభివ‌ర్ణించారు.

News September 29, 2024

‘సత్యం సుందరం’ వచ్చేది ఈ ఓటీటీలోనే

image

అరవింద్ స్వామి, కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ’96’ మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కొన్ని వారాల తర్వాత అందులో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించగా, సూర్య-జ్యోతిక నిర్మించారు.