News September 29, 2024
హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కేసు
TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదయింది. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోగా, అధికారులు ఇళ్లు కూల్చేస్తారన్న భయంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు NHRCకి ఫిర్యాదు చేశారు. దీంతో 16063/IN/224 కింద రంగనాథ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు NHRC తెలిపింది. కాగా బుచ్చమ్మ మరణానికి, హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు.
Similar News
News September 29, 2024
దేవర కలెక్షన్ల సునామీ
జూ.ఎన్టీఆర్ దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజు రూ.172 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు 2 రోజుల్లో రూ.243 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘దేవర కెరటం బాక్సాఫీసును ముంచెత్తింది. అన్ని ప్రాంతాలకు హెచ్చరికలు పంపింది’ అంటూ ఓ పోస్టర్ను పంచుకుంది. ఇవాళ సెలవు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.
News September 29, 2024
ఐమ్యాక్స్, జలవిహార్ను కూల్చాలి: దానం నాగేందర్
TG: హైడ్రాపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మురికవాడల జోలికి వెళ్లొద్దని హైడ్రాకు ముందే సూచించా. పేదల ఇళ్లు కూలగొట్టడం సమంజసం కాదు. కూలగొట్టడానికి ఐమ్యాక్స్, జలవిహార్ లాంటివి చాలా ఉన్నవి. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇళ్లు కూలగొట్టాల్సింది. ఇళ్లకు మార్కింగ్ చేయడం తొందరపాటు చర్య. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News September 29, 2024
PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?
TG: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితాను వెబ్సైటులో వెల్లడించింది. దీని ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఆఫీసులు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద వీటిని అందుబాటులో ఉంచారు. ఇక్కడ <