News September 29, 2024
ఇజ్రాయెల్ లెక్క సరి చేసింది: నెతన్యాహు
హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్ ‘లెక్క సరి’ చేసిందని ఆ దేశ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. నస్రల్లా మరణం అనంతరం ఆయన మొదటిసారి ప్రకటన ఇచ్చారు. ఎందరో ఇజ్రాయెలీలు, అమెరికన్లు, ఫ్రెంచ్ పౌరుల హత్యలకు కారణమైన సామూహిక హంతకుడిని అంతం చేసి ఇజ్రాయెల్ లెక్క సరి చేసిందన్నారు. తమ లక్ష్య సాధనకు నస్రల్లా మరణం అవసరమని పేర్కొన్న నెతన్యాహు ఇదొక చారిత్రక మలుపుగా అభివర్ణించారు.
Similar News
News September 29, 2024
ఐమ్యాక్స్, జలవిహార్ను కూల్చాలి: దానం నాగేందర్
TG: హైడ్రాపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మురికవాడల జోలికి వెళ్లొద్దని హైడ్రాకు ముందే సూచించా. పేదల ఇళ్లు కూలగొట్టడం సమంజసం కాదు. కూలగొట్టడానికి ఐమ్యాక్స్, జలవిహార్ లాంటివి చాలా ఉన్నవి. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇళ్లు కూలగొట్టాల్సింది. ఇళ్లకు మార్కింగ్ చేయడం తొందరపాటు చర్య. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News September 29, 2024
PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?
TG: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితాను వెబ్సైటులో వెల్లడించింది. దీని ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఆఫీసులు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద వీటిని అందుబాటులో ఉంచారు. ఇక్కడ <
News September 29, 2024
కన్సల్టేటివ్ ఫోరం ఛైర్మన్గా నారా లోకేశ్
AP: సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో పనిచేసే దీనికి ఛైర్మన్గా మంత్రి నారా లోకేశ్ వ్యవహరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఇది పనిచేయనుంది. ప్రభుత్వ శాఖలను RTGS శాఖ సమన్వయం చేస్తుంది.