News September 29, 2024
యాదాద్రి శ్రీవారి విమాన గోపురానికి స్వర్ణతాపడం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు దసరా పండుగ నాటి నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వర్ణ తాపడం పనులను స్మార్ట్ క్రియేషన్స్ వారికి అప్పగించారు. ఈ పనులను వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయనున్నారు.
Similar News
News December 29, 2025
NLG: యాప్ సమస్యలు వీడాలి.. కొనుగోళ్లు సాఫీగా సాగాలి: కలెక్టర్

బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన రూ.66 కోట్ల అపరిష్కృత ఖాతాల సొమ్మును సంబంధిత వారసులకు చేరేలా అవగాహన పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజావాణిలో ఆమె పలు శాఖల పనితీరుపై సమీక్షించారు. పత్తి రైతులకు ఇబ్బందిగా మారిన యాప్ సమస్యలను పరిష్కరించాలని, ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. రహదారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 29, 2025
NLG: యూరియా పంపిణీలో పారదర్శకత ఉండాలి: కలెక్టర్

రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతర నిఘా ఉంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సాగు పనుల దృష్ట్యా ఎరువుల పంపిణీ వద్ద వివాదాలు చోటుచేసుకోకుండా మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. పత్తి కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
News December 29, 2025
యాసంగి ప్రారంభంలోనే రైతన్నకు కష్టాలు!

అన్నదాతలకు యాసంగి ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. గత 15 రోజులుగా జిల్లాలో ఉష్ణోగత్రలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. దీంతో వరి నాటు వేసిన పొలాలు చలికి దెబ్బతింటున్నాయి. జిల్లా వ్యాప్తంగా రబీలో 5,64,678 ఎకరాల్లో వరి, వేరుశనగ ఇతర రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కాగా వేసిన నాట్లు ఏమాత్రం ఎదగకపోగా చలి తీవ్రతకు నాటంతా చనిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


