News September 29, 2024

మంత్రి ఉత్తమ్‌‌కు పితృవియోగం

image

TG: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు.

Similar News

News September 29, 2024

IND vs BAN: మూడో రోజూ వర్షార్పణమే

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. మైదానం ఇంకా చిత్తడిగా ఉండటంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కాగా ఇవాళ ఉదయం నుంచీ వర్షం కురవకపోయినా మైదానం చిత్తడిగానే ఉంది. అంపైర్లు రెండు సార్లు ఇన్‌స్పెక్షన్ చేసి ఆట నిర్వహణకు అనువుగా లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

News September 29, 2024

నస్రల్లా హత్య.. రంగంలోకి ‘బ్లాక్ యూనిట్’

image

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు బ్లాక్ యూనిట్ ప్రతీకారం తీర్చుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిని షాడో యూనిట్ లేదా యూనిట్ 910గా కూడా వ్యవహరిస్తారు. ఇది హెజ్బొల్లాలో కోవర్ట్ వింగ్. అప్పట్లో హెజ్బొల్లా చీఫ్ ముసావి హత్య అనంతరం ఈ యూనిట్ ప్రతీకార దాడులకు పాల్పడింది. లెబనాన్ బయట ఇది దాడులకు దిగుతుంది. యూదులు, దౌత్య కార్యాలయాలు, ఇజ్రాయెలీ పర్యాటకులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు చేస్తుంది.

News September 29, 2024

అకౌంట్లో డబ్బులు జమ కాని వారికి GOOD NEWS

image

AP: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. పలువురి బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ చేసింది. పలు కారణాలతో నగదు అందని బాధితులకు రేపు నేరుగా సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాయం అందిస్తారు. అటు వరద సాయంలో పాల్గొన్న వారితో భేటీ కానున్న సీఎం వారికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు సన్మానించనున్నారు.