News September 29, 2024
అకౌంట్లో డబ్బులు జమ కాని వారికి GOOD NEWS
AP: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. పలువురి బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ చేసింది. పలు కారణాలతో నగదు అందని బాధితులకు రేపు నేరుగా సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాయం అందిస్తారు. అటు వరద సాయంలో పాల్గొన్న వారితో భేటీ కానున్న సీఎం వారికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు సన్మానించనున్నారు.
Similar News
News September 29, 2024
ఆఫీసులో ఆగిన మరో గుండె.. టెకీ దుర్మరణం
పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆఫీసుల్లోనే ఉద్యోగులు మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాగ్పూర్లోని HCL కార్యాలయం వాష్రూమ్లో టెకీ నితిన్ ఎడ్విన్(40) కుప్పకూలారు. సహచరులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల లక్నోలోని HDFC బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సదాఫ్ ఫాతిమా, పుణేలో CA సెబాస్టియన్ పెరయిల్ ఇలాగే కన్నుమూశారు.
News September 29, 2024
ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్న ఎన్టీఆర్?
దేవర హిట్ కొట్టడంతో నెట్టింట తారక్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఫ్లాప్ చూసిన దర్శకుడికి వెంటనే హిట్ ఇవ్వాలంటే తారక్ తర్వాతేనని కొనియాడుతున్నారు. బాబీకి సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత జై లవకుశ, అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్కు అరవింద సమేత, హార్ట్ఎటాక్ మూవీ తర్వాత టెంపర్తో పూరీకి, నేనొక్కడినే తర్వాత సుకుమార్కు నాన్నకు ప్రేమతో, ఆచార్య తర్వాత కొరటాలకు దేవరతో హిట్స్ ఇచ్చారని గుర్తుచేసుకుంటున్నారు.
News September 29, 2024
మూసీ ధన దాహానికి లక్షల జీవితాలు బలి: KTR
TG: సీఎం రేవంత్ రెడ్డి రూ.1.50 లక్షల కోట్ల మూసీ ధన దాహానికి లక్షల జీవితాలు బలవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరాలను నిర్మించి కన్న బిడ్డలకు ఇవ్వలేకపోతున్నామని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. భార్య కడుపుతో ఉంది కనికరించరా అని ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్నారు. తొందరపడి మీ ప్రాణాలు బలితీసుకోవద్దు. న్యాయస్థానాలు ఉన్నాయి. మేమూ ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.