News September 29, 2024
‘ఆదిపురుష్’పై ట్రోలింగ్ వల్ల ఏడ్చాను: రచయిత

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ సినిమా ఫ్యాన్స్ను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ మూవీపై నెట్టింట జరిగిన ట్రోలింగ్ సినిమా టీమ్ అందర్నీ ప్రభావితం చేసిందని గేయ, మాటల రచయిత మనోజ్ ముంతషీర్ తెలిపారు. ‘ట్రోలింగ్తో ఏడ్చాను. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది. తిరిగి నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 8, 2025
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.
News November 8, 2025
TODAY HEADLINES

✦ ₹1,01,899Cr పెట్టుబడులకు CM CBN ఆమోదం
✦ బనకచర్ల DPR టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన AP
✦ TG: ఫీజు బకాయిల విడుదలకు ప్రభుత్వం అంగీకారం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్
✦ కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్
✦ వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానం: PM
✦ టెక్నికల్ సమస్య.. ఢిల్లీ, ముంబైలో విమాన సేవలకు అంతరాయం
News November 8, 2025
వాట్సాప్లో క్రాస్ ప్లాట్ఫామ్ మెసేజింగ్ ఫీచర్!

వాట్సాప్ క్రాస్ ప్లాట్ఫామ్ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి వాట్సాప్కు మెసేజ్ చేయొచ్చు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్, వాయిస్ నోట్స్ వంటి ఫైళ్లను థర్డ్ పార్టీ యాప్స్కు పంపొచ్చు. అయితే స్టేటస్లు, డిసప్పియరింగ్ మెసేజులు, స్టిక్కర్లు అందుబాటులో ఉండవు. ఇది టెస్టింగ్ దశలో ఉందని, వచ్చే ఏడాది అందుబాటులోకి రావొచ్చని ‘వాబీటా ఇన్ఫో’ పేర్కొంది.


