News September 30, 2024
ఖర్గేకు ప్రధాని మోదీ పరామర్శ

కశ్మీర్లో ఎన్నికల ర్యాలీ సమయంలో స్వల్ప అనారోగ్యంపాలైన AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను PM మోదీ ఫోన్లో పరామర్శించారు. ఖర్గే పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. కాగా.. మోదీని దించేవరకూ తాను చావనని కశ్మీర్ సభలో ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘నాకు 83 ఏళ్లు. కానీ అంత సులువుగా చావను. మీ కోసం ఈ ప్రభుత్వంతో పోరాడతాను’ అంటూ ఖర్గే ఆ ప్రసంగంలో నిప్పులు చెరిగారు.
Similar News
News November 6, 2025
226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకున్నారా?

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(<
News November 6, 2025
‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.
News November 6, 2025
‘నీమాస్త్రం’ తయారీ, వినియోగం (2/2)

ముందు చెప్పిన పదార్థాలను ఒక సిమెంట్ తొట్టె/డ్రమ్ములో వేసి బాగా తిప్పాలి. 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పిఉంచాలి. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం 2 నిమిషాల పాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోయాలి. ఇదే నీమాస్త్రం. దీన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. వారం లోపు వాడేసుకోవాలి.


