News September 30, 2024
అందుకే T20లకు రిటైర్మెంట్ ప్రకటించా: రోహిత్

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్-2024 గెలిచాక ఆ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెనకున్న కారణాలను ఆయన తాజాగా వెల్లడించారు. ‘నేను 17 ఏళ్లు ఈ ఫార్మాట్ను ఆస్వాదించా. వరల్డ్ కప్ గెలవడంతో ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం అనిపించింది. టీమ్ఇండియాలో గొప్ప ప్లేయర్లున్నారు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు.
Similar News
News January 29, 2026
ఆనందం డబుల్.. గ్రూప్-2 కొట్టిన భార్యాభర్తలు

AP: తాజా గ్రూప్-2 <<18979288>>ఫలితాల్లో<<>> అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భార్యాభర్తలు సత్తా చాటారు. భార్య వినీత సబ్ రిజిస్ట్రార్గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. HYDలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న సమయంలో నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రిపేర్ అయ్యారు. ఇద్దరూ జాబ్ కొట్టడంతో వారింట ఆనందం రెట్టింపయ్యింది. కాగా 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.
News January 29, 2026
డెలివరీకి సిద్ధంగా ఉన్నారా?

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఇంట్లోకి సంతోషం వచ్చేస్తుంది. ఈ సంతోషం కలకాలం ఉండాలంటే సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయాల్లో ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాది పాటు దుస్తులు, ఆహారం, వస్తువులు, మందులు ఇలా అన్నింటికీ సరిపడా పొదుపు చేసుకోవాలి. ఏది అవసరమో.. ఏది కాదో చూసి కొనుక్కోవాలి. ఎమర్జెన్సీ కోసం కాస్త డబ్బు దాచి ఉంచాలి.
News January 29, 2026
తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఛార్జ్షీట్లో ఏముంది?

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇటీవల CBI సిట్ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కీలకాంశాలు ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. ఆ నెయ్యిలో కొలెస్ట్రాల్ లేనట్లు NDDB రిపోర్టులో తేలిందని, అంటే జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ అయినట్లు చెబుతున్నాయి. మరోవైపు పాలు/వెన్న సేకరించకుండా రిఫైన్డ్ పామాయిల్, బీటా కెరోటిన్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలతో నెయ్యి లాంటిది తయారు చేశారని వార్తలొస్తున్నాయి.


