News September 30, 2024
ఇదేమీ కాఫీ షాప్ కాదు.. లాయర్పై CJI ఆగ్రహం

ఓ కేసు విచారణ సందర్భంగా లాయర్ ‘యా.. యా’ అంటూ మాట్లాడటంపై CJI చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇదేమీ కాఫీ షాప్ కాదు. ఈ యా యా ఏంటి? ఇలాంటి పదాలంటే నాకు చిరాకు. వీటిని ఇక్కడ అనుమతించను’ అని హెచ్చరించారు. 2018లో అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పిటిషన్ను డిస్మిస్ చేయడాన్నిసవాల్ చేస్తూ ఈ కేసులో ఆయననే ప్రతివాదిగా చేర్చాలంటూ పిల్ దాఖలు చేశారు. గొగోయ్ పేరును తొలగించాలని CJI స్పష్టం చేశారు.
Similar News
News February 13, 2026
ఒంటరితనంతో ఎన్నో అనారోగ్యాలు

ఒంటరితనం అనుభవించేవారిలో ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. దీర్ఘకాలంలో ఒంటరితనంతో బాధపడుతున్నవారిలో టైప్ 2 డయాబెటిస్, జ్ఞాపకశక్తి తగ్గడం, త్వరగా వృద్ధాప్యం రావడం, గుండె జబ్బులు వంటివి ఎక్కువవుతాయంటున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే క్లోజ్ అనిపించే వ్యక్తితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని, వీలైనంత ఎక్కువమందితో కమ్యునికేట్ చేయాలని సూచిస్తున్నారు.
News February 13, 2026
ఒకప్పుడు అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేది: చంద్రబాబు

AP: చట్టసభ అనేది ప్రజా దేవాలయమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేదని వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ కూడా నిర్వహించామన్నారు. సభలో సభ్యులకంటే స్టూడెంట్సే బాగా మాట్లాడారని ప్రశంసించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు.
News February 13, 2026
మున్సిపల్ ఎన్నికలు.. ఖాతా తెరిచిన జనసేన

TG: మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు 336 వార్డుల్లో పోటీ చేయగా ప్రస్తుతానికి ఓ చోట గెలుపొందారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పొత్తుతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి 14వ వార్డులో విజయం సాధించారు. అక్కడ 15 వార్డులుండగా కాంగ్రెస్ 9 వార్డుల్లో, బీఆర్ఎస్ 5 వార్డుల్లో గెలిచాయి. దీంతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశమైంది.


