News September 30, 2024
లడ్డూ వివాదం.. సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
తిరుమల లడ్డూలలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ వ్యాఖ్యానించిన CM చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో ఆధారాలు లేకుండా, రెండో అభిప్రాయం తీసుకోకుండా పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడారు? లడ్డూలను టెస్టులకు పంపారా? ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించినప్పుడు బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రభుత్వ లాయర్ను ప్రశ్నించింది.
Similar News
News September 30, 2024
పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదు: లోకేశ్
AP: స్కూళ్లలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. సాల్డ్ ప్రాజెక్టు ద్వారా HMలు, SGTలకు సమగ్ర శిక్షణ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు నెలాఖరులోగా ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రతి స్కూలుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అందించాలని, పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. స్కూళ్లలో హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
News September 30, 2024
ఆ విద్యార్థి కోసం విచక్షణాధికారాన్ని వాడిన సుప్రీంకోర్టు
ఓ విద్యార్థి కోసం సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ద్వారా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించింది. IIT ధన్బాద్లో అడ్మిషన్ పొందడానికి ₹17,500 కట్టలేకపోవడంతో UPకి చెందిన అతుల్ కుమార్ సీటు కోల్పోయారు. 3 నెలలపాటు పలు వేదికలను ఆశ్రయించినా ఆ దళిత విద్యార్థికి న్యాయం జరగలేదు. చివరికి SCని ఆశ్రయించగా ప్రతిభావంతుడైన ఆ విద్యార్థికి సీటు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. విద్యార్థికి All The Best చెప్పింది.
News September 30, 2024
నిజం తెలిసి దాచి ఉంటే అది నిజమైన పాపం: TDP
AP: తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వం రాజీపడదు, రాజకీయం చేయదని TDP ట్వీట్ చేసింది. ‘నెయ్యి కల్తీ జరిగిందని NDDB లాంటి పేరున్న సంస్థ రిపోర్ట్ చూడగానే CM ప్రజల ముందు ఉంచారు. నిజం తెలిసి దాచి ఉంచితే అది నిజమైన పాపం. వాస్తవాలు తేల్చడానికే సిట్ ఏర్పాటు చేశారు. అనేక చర్యలతో ప్రజల్లో అభద్రతను పోగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లడ్డూ నాణ్యతలో మార్పు వచ్చిందని ప్రజలు అంటున్నారు’ అని పేర్కొంది.