News September 30, 2024

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికులకు ఆఫర్లు పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. అటు అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తామని తెలిపింది. ఛార్జీలు నామ మాత్రంగానే ఉంటాయంది.

Similar News

News October 1, 2024

KGBVల్లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

AP: KGBVల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ వరకూ దరఖాస్తు చేయవచ్చు. ఇందులో టీచర్ జాబ్‌లు 507 కాగా, నాన్-టీచింగ్ ఉద్యోగాలు 97 ఉన్నాయి. OCT 14 నుంచి 16లోగా మెరిట్ లిస్ట్ విడుదల చేసి, 17, 18 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. 19న ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించి, 23న అపాయింట్‌మెంట్ లెటర్లు అందిస్తారు. వివరాలకు <>క్లిక్<<>> చేయండి.

News September 30, 2024

ఐపీఎల్ వేలం విదేశాల్లో ఉండొచ్చు: శుక్లా

image

వచ్చే ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించే అవకాశాలున్నాయని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అయితే దానిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు. ‘మన టోర్నీ ప్రాచుర్యాన్ని విదేశాలకూ విస్తరింపచేయాలనేదే మా లక్ష్యం. దానికి తగ్గట్టుగా విదేశాల్లో కూడా వేలం నిర్వహిస్తాం. బయటి దేశాల్లో మ్యాచులెలాగూ ఆడట్లేదు కాబట్టి కనీసం వేలం వంటి ఈవెంట్స్‌తో జనం దృష్టిని ఆకర్షించాలి’ అని వివరించారు.

News September 30, 2024

CM చంద్రబాబును కలిసిన సీపీఐ నేతలు

image

AP: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలిశారు. ప్రజా సమస్యలు, బుడమేరు, కొల్లేరు ఆక్రమణల తొలగింపు, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడం, గాంధీ జయంతి రోజు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడం వంటి అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు.