News September 30, 2024

మహిళలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి: ఎంపీ కావ్య

image

మహిళలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్లో కావ్య మాట్లాడుతూ.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, ఇలాంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలని లేకపోతే ప్రాణాంతకం అయి ప్రాణాలకే ముప్పు వస్తుందని హెచ్చరించారు. మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Similar News

News January 9, 2026

వరంగల్ జిల్లాలో సరిపడా యూరియా ఉంది: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోని యాసంగి 2025- 26 పంటల సాగుకు సరిపడా యూరియా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ యాసంగి పంటకు 19770 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 9770 మెట్రిక్ టన్నుల జనవరి మాసంలో రైతులకు అవసరం మేరకు అందించడం జరుగుతుందన్నారు.

News January 8, 2026

వరంగల్: పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

image

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ సభల్లో 31 మందితో కూడిన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడుగా పి.మహేశ్, ప్రధాన కార్యదర్శిగా పొడపంగి నాగరాజు, కోశాధికారిగా డి.ప్రణయ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు.

News January 8, 2026

WGL: సన్న వడ్ల బోనస్ బకాయిలు రూ.54 కోట్లు!

image

జిల్లాలో సన్న వడ్ల బోనస్ బకాయిలు రూ.54 కోట్ల మేర ఉన్నాయి. 15,311 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయగా, మరో 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎస్ఎస్పీ కింద రూ.346.3 కోట్లను రైతులకు చెల్లించగా, మరో రూ.20 కోట్లను చెల్లించాల్సి ఉంది. సన్న వడ్ల బోనస్ కింద రూ.75.2 కోట్లను చెల్లించాల్సి ఉండగా, రూ.21.2 కోట్లను మాత్రము ప్రభుత్వం చెల్లించింది.