News September 30, 2024
స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవు: APSRTC
AP: దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు APSRTC ప్రకటించింది. అక్టోబర్ 4-20 వరకు 6100 బస్సులు నడుపుతామని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఇతర నగరాలకు బస్సులు తిప్పుతామంది. అక్టోబర్ 4-11 వరకు 3040 బస్సులు, అక్టోబర్ 12-20 వరకు 3060 బస్సులు తిరుగుతాయని చెప్పింది. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
Similar News
News October 1, 2024
నిసాన్ మాగ్నైట్ ఫేస్లిఫ్ట్.. వచ్చేది ఎప్పుడంటే..
కార్ల తయారీ రంగంలో కాంపాక్ట్ SUV మాగ్నైట్తో నిసాన్ భారత మార్కెట్లో కొంతమేర భాగస్వామ్యం దక్కించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఆ కారు ఫేస్లిఫ్ట్ను అక్టోబరు 4న తీసుకొస్తోంది. ప్రీలాంఛ్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయినట్లు సంస్థ ప్రకటించింది. మారుతీ ఫ్రాంక్స్, బ్రెజా, రెనాల్ట్ కైగర్, కియా సొనెట్ కార్లకు ఇది పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్స్షోరూమ్లో దీని ప్రారంభ ధర సుమారు రూ.6లక్షలు ఉండొచ్చని అంచనా.
News October 1, 2024
రక్తమోడిన రోడ్లు.. ఏడుగురి మృతి
TG: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్(D) మేకలగండి వద్ద NH-44పై అర్ధరాత్రి డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సాయంత్రం సూర్యాపేట(D) సీతారామపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. బైక్ను లారీ ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది.
News October 1, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 1, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:25 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:05 గంటలకు
ఇష: రాత్రి 7.17 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.