News October 1, 2024

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 4,72,512 మందికి పింఛన్లు

image

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,72,512 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక డాష్‌బోర్డు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,33,248 మందికి రూ.99,45,900,00, కృష్ణా జిల్లాలో 2,39,264 మందికి రూ.1,01,50,95,000 అక్టోబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Similar News

News February 23, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
28న గన్నవరంలో జాబ్ మేళా
పెనమలూరు: ఇంటర్ విద్యార్థి మృతి
కనకదుర్గ వారధి నుంచి గంగూరుకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్
పామర్రు : క్షణకావేశంలో తండ్రిని హతమార్చిన కొడుకు
విజయవాడలో రేపు ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు
NTR : లంచం అడిగితే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి.!

News February 23, 2026

కృష్ణా: 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్‌కు ప్రణాళికలు

image

విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గంగూరు వరకు 14KM ఎలివేటెడ్ మెగా ఫ్లైఓవర్ కారిడార్ నిర్మాణానికి NH అధికారులు సానుకూలంగా స్పందించారు. బందరు రోడ్డునుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ ఆటంకం లేకుండా అమరావతి వైపు ప్రయాణించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్డు విస్తరణ లేకుండానే 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. గంగూరు- దావులూరు ORR వరకు హైవేను 6 లైన్లుగా విస్తరిస్తారు.

News February 23, 2026

కృష్ణా: అపరాల కోతలకు కూలీల కొరత

image

జిల్లాలో రెండో పంటగా సాగుచేసిన అపరాల పంట కోతల దశకు చేరుకోవడంతో రైతులకు కూలీల కొరత తీవ్రంగా ఎదురవుతోంది. స్థానికంగా వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో జిల్లాకు తరలివస్తున్నారు. ప్రస్తుతం అపరాల పంట కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కూలీలకు డిమాండ్ ఏర్పడింది.