News October 1, 2024
టీమ్ ఇండియా రికార్డుల విధ్వంసం
బంగ్లాతో రెండో టెస్టులో టీమ్ ఇండియా రికార్డుల విధ్వంసం సృష్టించింది. అవి.. టెస్టుల్లో జట్టు స్కోర్లలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 రన్స్. తొలి 3 ఓవర్లలోనే స్కోరు 50 దాటించిన ఏకైక జట్టు. కనీసం 200 బంతులు ఆడిన ఇన్నింగ్స్లలో అత్యధిక రన్రేట్(8.22). పురుషుల క్రికెట్లో అత్యంత వేగవంతమైన 50+ భాగస్వామ్యం(రోహిత్-జైస్వాల్: 23 బంతుల్లో 55). టెస్టుల్లో ఒక ఏడాదిలో అత్యధిక సిక్సులు(96).
Similar News
News October 1, 2024
కొనసాగుతున్న బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’
TG: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ‘రైతు హామీల సాధన దీక్ష’ కొనసాగుతోంది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు 24 గంటల దీక్ష చేస్తున్నారు. ‘అర్ధరాత్రి 2 దాటినా రైతు హామీల సాధన దీక్ష కొనసాగుతోంది. బీజేపీ ప్రతినిధులు దీక్షా శిబిరంలో సేద తీరుతున్నారు’ అని ఇందుకు సంబంధించిన ఫొటోలను టీ బీజేపీ Xలో పోస్ట్ చేసింది.
News October 1, 2024
వరద బాధితుల ఖాతాల్లో రూ.588కోట్లు జమ
AP: వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొత్తం ₹602కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ₹588కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు CMకి తెలిపారు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయి లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, వివరాలు సరిగా లేకపోవడంతో కొందరి అకౌంట్లలో నగదు జమ కాలేదని, బ్యాంక్కు వెళ్లి KYC పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించామన్నారు.
News October 1, 2024
US వీసా కోసం వెయిట్ చేస్తున్నవారికి గుడ్న్యూస్
US వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నవారికి ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటీ గుడ్ న్యూస్ చెప్పారు. భారతీయుల కోసం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్స్ కేటాయించినట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటికే 12 లక్షలకు పైగా ఇండియన్స్ US వెళ్లారు. అమెరికా గణాంకాల ప్రకారం.. 2023 అక్టోబరు నుంచి ఏడాది కాలంలో 6 లక్షల స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేయగా వాటిలో ప్రతి నాలుగింటిలో ఒకటి భారత విద్యార్థిదే కావడం గమనార్హం.