News October 1, 2024
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఎంతంటే?

TG: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్గా ఈ ఏడాది ₹93,750 చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. మొత్తం 42,000 మంది కార్మికులకు ఈ బోనస్ వర్తించనుంది. గత ఏడాది ₹85,500 చెల్లించగా, ఈసారి అదనంగా ₹8,250 ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది సంస్థ సాధించిన లాభాల్లో 33% కార్మికులకు చెల్లించాలని సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన డబ్బులు ఈనెల 7న కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి.
Similar News
News February 8, 2026
యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు(ఆదివారం) గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. ఉదయం 5:30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
News February 8, 2026
TODAY HEADLINES

⋆ AP: అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన
⋆ క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్: CM చంద్రబాబు
⋆ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు SEC సన్నాహాలు
⋆ TG: కేసీఆర్ మనోడు కాదు పరాయి వాడు: CM రేవంత్
⋆ KCRపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్కు లేదా: కిషన్ రెడ్డి
⋆ రేవంత్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేరు: KTR
⋆ పెరిగిన బంగారం, వెండి ధరలు
⋆ టీ20 WC: USAపై భారత్ విజయం
News February 8, 2026
బాబర్ ఆజంను దాటేసిన సూర్యకుమార్

ముంబై వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్లో టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. USతో జరిగిన డెబ్యూ మ్యాచ్లోనే 84 (నాటౌట్) రన్స్తో అదరగొట్టిన అతడు.. బాబర్ ఆజం రికార్డును తుడిచిపెట్టేశారు. టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ డెబ్యూలో అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. 2021లో భారత్పై బాబర్ చేసిన 68 రన్స్ రికార్డును దాటి క్రిస్ గేల్ (88) తర్వాతి స్థానంలో ఉన్నారు.


