News October 1, 2024
హెజ్బొల్లా రాజకీయ పార్టీ: ఇరాన్
హెజ్బొల్లా టెర్రరిస్టు గ్రూప్ కాదని, అదో రాజకీయ పార్టీ అని భారత్లో ఇరాన్ అంబాసిడర్ Dr.ఇరాజ్ ఇలాహీ అన్నారు. తమ రక్తపాతం, విధ్వంసాన్ని జస్టిఫై చేసుకొనేందుకే ఇజ్రాయెల్ దానిని టెర్రరిస్టు గ్రూప్గా ముద్ర వేస్తోందన్నారు. ‘హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం ముస్లిములు, లెబనాన్కే కాదు ప్రపంచ మానవాళికే భారీ నష్టం. ఆయనో గ్రేట్ లీడర్, పొలిటీషియన్. ప్రపంచంలో అందరికీ తెలియడం చిన్న విషయం కాదు’ అని అన్నారు.
Similar News
News October 12, 2024
చరిత్ర సృష్టించిన భారత్
ఉప్పల్ స్టేడియంలో టీమ్ ఇండియా రికార్డుల మోత మోగించింది.
*టెస్టు హోదా ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే (297)
*టీ20ల్లో టీమ్ ఇండియాకు ఇదే హయ్యెస్ట్ స్కోర్ (297)
*భారత్ ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు (22)
*భారత టీమ్ తరఫున ఫాస్టెస్ట్ 100- 7.2 ఓవర్లలో
*భారత టీమ్ తరఫున ఫాస్టెస్ట్ 200- 13.6 ఓవర్లలో
News October 12, 2024
నాకు ఆ సమస్య ఉంది: ఆలియా భట్
తనకు ఆరోగ్యపరంగా ఉన్న సమస్య గురించి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఓ పాడ్కాస్ట్లో వెల్లడించారు. ‘మా కూతురు రాహా ఫొటోను షేర్ చేయడంపై ఆసక్తి ఉండేది కాదు. తను ఇన్స్టాలో రీల్ కావడం నాకిష్టం లేదు. రాహాతో కలిసి ఫొటో దిగుదామని రణ్బీర్ అన్నప్పుడు కంగారుపడ్డా. ఎందుకంటే ప్రతి క్షణం నేను ఆందోళనకు గురవుతా. కొన్నిసార్లు అది తీవ్రంగా ఉంటుంది. రణ్బీర్ నా సమస్యను అర్థం చేసుకుని ప్రవర్తిస్తుంటాడు’ అని తెలిపారు.
News October 12, 2024
కశ్మీరీ పండిట్లకు ఫరూక్ అబ్దుల్లా కీలక వినతి
కశ్మీర్ వ్యాలీ నుంచి వలస వెళ్లిపోయిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు రావాల్సిందిగా ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్ను శత్రువులా భావించవద్దని కోరారు. ‘వెళ్లిపోయిన వారు తిరిగి రావడానికి సమయం వచ్చేసింది. మేము కేవలం కశ్మీరీ పండిట్ల గురించే కాకుండా జమ్మూ ప్రజల గురించి కూడా ఆలోచిస్తాం. మనం అందరం భారతీయులం. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలి’ అని పేర్కొన్నారు.