News October 1, 2024

MUDA SCAM: తన భార్య మానసిక క్షోభ బాధాకరమన్న సిద్దరామయ్య

image

తనకు కేటాయించిన 14 ప్లాట్లను ముడాకు తిరిగిచ్చేయాలన్న తన భార్య నిర్ణయం ఆశ్చర్యపరిచిందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కుటుంబానికే పరిమితమైన ఆమె ప్రతిపక్షాల కుట్రతో మానసిక క్షోభ అనుభవిస్తోందని తెలిపారు. ‘తల వంచకుండా అన్యాయానికి ఎదురెళ్లడమే నా మార్గం. కానీ నాపై జరిగిన రాజకీయ కుట్రతో ఆమె ఆవేదన చెందింది. ప్లాట్లను తిరిగివ్వాలని నిర్ణయించుకుంది. ఆమె మానసిక వేదన బాధాకరం’ అని పేర్కొన్నారు.

Similar News

News October 16, 2024

AP TET అభ్యర్థులకు అలర్ట్

image

AP: ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షల ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. పేపర్ 1A, 1B ఆన్సర్ ‘కీ’తో పాటు క్వశ్చన్ పేపర్లు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 18వ తేదీలోపు టెట్ <>వెబ్‌సైట్<<>> ద్వారా సమర్పించాలని సూచించింది.

News October 16, 2024

ఆ 3 పాపాలపై నో కాంప్రమైజ్: పాక్‌లో జైశంకర్

image

ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదంపై పోరాటమే SCO ప్రాథమిక లక్ష్యమని EAM జైశంకర్ ఇస్లామాబాద్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది మరింత కీలకమన్నారు. SCOకు నిజాయితీ సంభాషణలు, నమ్మకం, పొరుగువారితో స్నేహం, ఛార్టర్‌కు కట్టుబడి ఉండటం అవసరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, సప్లై చైన్ అవాంతరాలు వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలకు అప్పులు ఆందోళనకరంగా మారాయని వెల్లడించారు.

News October 16, 2024

త్వరలోనే వారికి రూ.7,500: మంత్రి తుమ్మల

image

TG: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500(ఏడాదికి ఎకరాకు రూ.15వేలు) ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.