News October 1, 2024
లడ్డూ వివాదం.. నేతలకు టీడీపీ కీలక ఆదేశాలు
AP: తిరుమల లడ్డూ అంశంలో CM చంద్రబాబు, ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ నేతలకు TDP కీలక ఆదేశాలిచ్చింది. కోర్టు, న్యాయమూర్తులపై విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలే ప్రజలకు చెప్పాలని కోరింది. చంద్రబాబు శ్రీవారి భక్తుడని, ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం ప్రజలకు చెప్పారని తెలిపింది.
Similar News
News October 1, 2024
శృంగారం తర్వాత రక్తస్రావం.. గూగుల్లో రెమిడీస్ వెతికిన బాయ్ఫ్రెండ్
కామన్సెన్స్ లేకుండా ఆన్లైన్ రెమిడీస్ వెతకడం ఎంత డేంజరో చెప్పడానికి ఇదే ఉదాహరణ. గుజరాత్లో 23Yrs నర్సింగ్ గ్రాడ్యుయేట్, ఆమె బాయ్ఫ్రెండ్ SEP23న హోటల్కెళ్లి శృంగారంలో పాల్గొన్నారు. అప్పుడామెకు విపరీతంగా రక్తస్రావమైంది. ఓ వైపు ఆమె భయపడుతోంటే అతడేమో గూగుల్లో రెమిడీస్ వెతికాడు. విలువైన సమయం వృథా కావడంతో ఆమె స్పృహ తప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్తే చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు.
News October 1, 2024
రైలు ప్రయాణికులకు అలర్ట్
రైలు ప్రయాణాల్లో రిజర్వేషన్ చేయించుకున్నవారు టికెట్తో పాటు ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు. టీటీఈ అడిగినప్పుడు గుర్తింపు కార్డును చూపించకపోతే టికెట్ లేనట్లు పరిగణించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకరి టికెట్తో మరొకరు ప్రయాణించడాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆధార్, ఓటర్, పాన్, లైసెన్స్ తదితరాల్లో ఏ ఐడీ కార్డునైనా చూపించవచ్చు.
News October 1, 2024
ఈ వికెట్ కీపర్లకు భారీ డిమాండ్
త్వరలో జరిగే IPL2025 మెగావేలంపై భారీ అంచనాలున్నాయి. అయితే భారీ సిక్సర్లు బాదడంతో పాటు మెరుపులా వికెట్ కీపింగ్ చేసే వారిపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, ధ్రువ్ జురేల్, జితేశ్ శర్మపై అందరి దృష్టి నెలకొంది. ఇషాన్కు MI 2022లోనే రూ.15.25కోట్లు వెచ్చించిన విషయం తెలిసిందే. RR తరఫున ధ్రువ్, PBKSలో జితేశ్ అంచనాలకు మించే రాణించారు. వీరిలో మీ ఓటు ఎవరికి?