News October 1, 2024
అక్టోబర్ 2 నుంచి గ్రామ సభలు: ప్రకాశం కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అక్టోబర్ 2వ తేదీ గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి సోమవారం మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రజల అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవ ప్రణాళికలు రూపొందించాలన్నారు.
Similar News
News March 13, 2026
ప్రకాశం: రైతుల ఖాతాల్లో రూ.108.30 కోట్లు మంజూరు

PM కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. ప్రకాశం జిల్లాలోని రైతులకు రూ.108.30 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. దర్శికి రూ.24.40 కోట్లు, కొండపికి రూ.21.10 కోట్లు, ఒంగోలుకు రూ.5.31 కోట్లు, S.N పాడు రూ.15.85 కోట్లు, అద్దంకి రూ.23.31 కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శుక్రవారం బ్యాంక్ ఖాతాల్లో నగదు మంజూరు అవుతుందని తెలిపారు.
News March 12, 2026
మార్కాపురంలో కొత్తగా రూర్బన్ పంచాయతీలు

పంచాయతీ జనాభా వార్షిక ఆదాయం, భౌగోళిక స్వరూపం ఆధారంగా ప్రభుత్వం విభజన చేపట్టింది. ఇప్పటివరకు ఐదు గ్రేడులుగా ఉండగా వాటిని నాలుగు గ్రేడులుగా కుదించింది. కొత్తగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉండగా వాటిలో 8 రూర్బన్, 63 గ్రేడ్-1, 108 గ్రేడ్-2, 227 గ్రేడ్-3 పంచాయతీలుగా విభజించారు. రూర్బన్ పంచాయతీలకు గెజిట్ అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు.
News March 12, 2026
పొదిలి: వామ్మో.. ఇలానూ మోసం చేస్తారా..?

పొదిలిలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదే సమయంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీకు లైసెన్స్ లేదు. తనిఖీలు చేయకుండా ఉండాలంటే రూ.60వేలు ఇవ్వండి’ అని కోరగా.. భయపడిన నిర్వాహకుడు రూ.6వేలు ఫోన్ పే చేశాడు. అసలు అధికారి తనిఖీలకు వెళ్లగా.. మీకు డబ్బులు పంపానని నిర్వాహకుడు చెప్పాడంతో ఆయన అవాక్కయ్యాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.


