News October 1, 2024
భీమవరంలో యువకుడి ఆత్మహత్య
భీమవరంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కె.మణికంఠ కుమార్(32) సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మంగళవారం ఉదయం అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News October 1, 2024
వరద బాధితులకు భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ విరాళం
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని, వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం రూ.1,50,116 విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించారు.
News October 1, 2024
ఏలూరు: కాలువలో బాలుడి మృతదేహం లభ్యం
ఏలూరులో చెల్లి పుట్టిన రోజు వేడుకల్లో పేరెంట్స్, బంధువులు మందలించారని పదో తరగతి విద్యార్థి పోలినాయుడు(16) ఆదివారం <<14229870>>కాలువలో దూకిన<<>> విషయం తెలిసిందే. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. బాలుడి మృతదేహం లభ్యమైంది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారావుకు కుమారుడు పోలినాయుడు, కుమార్తె సంతానం. కుమార్తె పుట్టిన రోజు నాడే కుమారుడు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News October 1, 2024
ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. భీమవరం మహిళను మోసం చేసిన HYD వాసి
ప.గో జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఓ మహిళను HYDకు చెందిన కృష్ణమోహన్ ఉద్యోగం పేరిట మోసం చేసినట్లు SI రెహమాన్ సోమవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. సదరు మహిళ, కృష్ణమోహన్ ఇన్స్టాగ్రామ్లో స్నేహితులయ్యారన్నారు. తన తమ్ముడికి ఉద్యోగం కావాలని ఆమె కోరగా.. అదే ఛాన్స్గా తీసుకొని కృష్ణమోహన్ విడతల వారీగా రూ.1,08,000 నగదు తీసుకున్నాడు. మోసపోయినట్లు తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.