News October 1, 2024

కేటీఆర్, హరీశ్‌కు మానవత్వం ఉందా?: కోమటిరెడ్డి

image

TG: మీకు గోదావరి నీళ్లు.. మాకు మూసీ నీళ్లా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులను ప్రశ్నించారు. వారికి అసలు మానవత్వం ఉందా అని ఆయన నిలదీశారు. ‘మిమ్మల్ని ఓడించినందుకు నల్గొండ ప్రజలపై కక్ష గట్టారు. నల్గొండ అంటే ఎందుకంత కోపం? మూసీ ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డుపడితే ప్రత్యక్ష ఉద్యమం చేపడతాం’ అని ఆయన హెచ్చరించారు.

Similar News

News November 9, 2025

ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

image

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News November 9, 2025

కార్తీకంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం?

image

దీప దానం చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది.
అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
వస్త్ర దానం వల్ల శివానుగ్రహం కలుగుతుంది.
స్వయంపాకం దానమిస్తే గౌరవం పెరుగుతుంది.
ఉసిరికాయలు దానం చేస్తే శుభం కలుగుతుంది.
గోదానంతో కృష్ణుడి కృప మీపై ఉంటుంది.
తులసి దానం చేస్తే మోక్షం లభిస్తుంది.
ధన దానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
పండ్లను దానం చేస్తే సంతానం కలుగుతుంది.

News November 9, 2025

లాంచీలో శ్రీశైలం యాత్ర

image

TG: కృష్ణా నదిలో నల్లమల అందాలను వీక్షిస్తూ నాగర్‌కర్నూల్(D) సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ యాత్ర పున:ప్రారంభమైంది. మంగళ, గురు, శనివారాల్లో భక్తులు సోమేశ్వరుడిని దర్శించుకున్నాక 9AMకు లాంచీ బయలుదేరుతుంది. మల్లన్న దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. నిర్వాహకులు భోజనం, స్నాక్స్ అందిస్తారు. వన్ సైడ్ జర్నీకి పెద్దలకు ₹2000, పిల్లలకు ₹1600 వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు https://tgtdc.in/లో చూడగలరు.