News October 1, 2024

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్

image

AP: రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది. వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్‌లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Similar News

News January 20, 2026

CRPF పురుషుల బృందాన్ని నడిపించనున్న మహిళా అధికారి!

image

రిపబ్లిక్ డే కవాతులో చరిత్ర సృష్టించేందుకు CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా(26) సిద్ధమవుతున్నారు. J&Kకు చెందిన ఈ అధికారి తమ పురుష దళానికి నాయకత్వం వహించనున్నారు. CRPFలో 140 మందితో కూడిన మేల్ కమాండ్‌ను లేడీ ఆఫీసర్ లీడ్ చేయడం ఇదే తొలిసారి. రాజౌరి(D) నుంచి ఆఫీసర్ ర్యాంకులో చేరిన తొలి మహిళ కూడా బాలానే కావడం విశేషం. 2020లో ఆర్మీ డే పరేడ్‌ను లీడ్ చేసిన మొదటి మహిళగా తానియా షేర్ గిల్ నిలిచారు.

News January 20, 2026

ఆ విషయం నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: గుడివాడ

image

AP: చలి కారణంగా తాను దావోస్ వెళ్లలేదని లోకేశ్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని YCP నేత గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. బ్రాండ్ ఇమేజ్‌తో కాదు బ్యాండ్ మేళంతో CBN, లోకేశ్ సమ్మిట్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పండుగ పేరుతో అశ్లీల నృత్యాలు చేయిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా అని ప్రశ్నించారు. కేంద్రంలో చక్రం తిప్పుతున్నాం అని చెప్పుకునే వాళ్లు NTRకు భారతరత్న ఎందుకు తెచ్చుకోలేకపోయారని నిలదీశారు.

News January 20, 2026

ఈ ఐదుగురు మిత్రులు మీతో ఉన్నారా?

image

మనకు 5 రకాల స్నేహితులు తోడుగా ఉండాలి. నిత్యం దైవ లీలలను స్మరిస్తూ మనల్ని నవ్వించే ‘విదూషకుడు’, ధర్మమార్గంలో నడిపిస్తూ జీవిత పాఠాలు నేర్పే ‘మార్గదర్శి’, క్లిష్ట సమయాల్లో త్వరిత నిర్ణయాలు తీసుకునే ‘ధైర్యశాలి’ ఉండాలి. మన భక్తిలోని లోపాలను ప్రశ్నించి సరిదిద్దే ‘పృచ్ఛకుడు’, మనపై పూర్తి నమ్మకంతో దైవకార్యాల్లో అండగా నిలిచే ‘విశ్వాసి’ వంటి మిత్రులు ఉండాలి. ఇలాంటివారు మీకుంటే అది నిజంగా దైవానుగ్రహమే.