News October 1, 2024

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్

image

AP: రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది. వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్‌లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Similar News

News October 1, 2024

మహిళా సామూహిక శక్తి బతుకమ్మ: కేసీఆర్

image

TG: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు మాజీ CM కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు బతుకమ్మ దర్పణం. రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచింది. బతుకమ్మ ప్రాశస్త్యాన్ని గుర్తించి BRS ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది’ అని ఆయన పేర్కొన్నారు.

News October 1, 2024

జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా

image

జపాన్ కొత్త PMగా రక్షణ శాఖ మాజీ మంత్రి షిగేరు ఇషిబా(67) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశానికి రక్షణను మరింత పటిష్ఠం చేయడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దేశ భద్రత అత్యంత బలహీనంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా శాంతిస్థాపనకు, చైనాను అడ్డుకునేందుకు మిత్రదేశాలతో మైత్రిని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ప్రకటించారు. 19మంది మంత్రులతో కూడిన ఆయన క్యాబినెట్ ఈరోజు కొలువుదీరింది.

News October 1, 2024

Festival Sale: తెగ షాపింగ్ చేస్తున్నారు

image

ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ప్ర‌క‌టించిన‌ ఫెస్టివల్ సేల్‌లో కొనుగోళ్లు గత ఏడాది సేల్ ప్రారంభ రోజుల‌తో పోలిస్తే 20% పెరిగిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ ఆఫర్‌లు, వెరైటీల కోసం ఎదురుచూస్తారు కాబ‌ట్టి ఈ సీజ‌న్ ఉత్తేజ‌క‌రంగా మారింద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఫ్యాష‌న్‌, యాక్సెస‌రీల కొనుగోళ్లు 32% పెరిగాయి. ట్రావెల్ యాక్సెస‌రీలు, పిల్ల‌ల వ‌స్తువులు, వాచ్‌ల‌ను అధికంగా కొంటున్న‌ట్టు తేలింది.