News October 1, 2024

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరులో క్రిష్టప్ప అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. పొలంలో విద్యుత్ స్టాటర్ పెట్టె వద్ద క్రిష్టప్పకు షాక్ కొట్టి మృతిచెందారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.

Similar News

News January 20, 2026

అనంతపురం: ఉద్యోగుల వైద్య శిబిరానికి స్పందన

image

అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌తోపాటు కలెక్టరేట్, రెవెన్యూ, సర్వే ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

News January 19, 2026

122 అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి 122 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఎస్పీ స్వయంగా బాధితుల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన, చట్టపరిధిలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

News January 19, 2026

అనంతపురం: 54 మంది జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

image

అనంతపురం జిల్లా పరిషత్ పరిధిలోని 54 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు. జడ్పీ సీఈఓ శివ శంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.