News October 2, 2024
BREAKING: సిద్దరామయ్యకు ఈడీ నోటీసులు

ముడా స్కాంలో ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 3న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఖరీదైన భూములను తన భార్య పార్వతికి సిద్దరామయ్య కేటాయించారనేది ఆరోపణ. దీనిపై ED కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆ భూములు తిరిగి ఇచ్చేస్తామని పార్వతి ప్రకటించారు.
Similar News
News January 5, 2026
ఎండోమెట్రియోసిస్ ఉంటే పిల్లలు పుట్టరా?

మహిళల్లో ఎండోమెట్రియల్ లైనింగ్ మందంగా ఉంటే నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, నొప్పి, స్పాటింగ్ వంటివి ఉంటాయి. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీని తీవ్రతను బట్టి గర్భధారణ సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారిలో అబార్షన్, ప్రీటర్మ్ డెలివరీ వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ✍️ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.
News January 5, 2026
ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స

ఎండోమెట్రియోసిస్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా పెల్విక్ నొప్పి, పీరియడ్స్లో నొప్పి, హెవీ బ్లీడింగ్, స్పాటింగ్, ప్రేగు కదలిక నొప్పి, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, సంతానలేమి ఉంటాయి. హార్మోన్ థెరపీ తీసుకోవడం కొన్నిసార్లు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇవి ఎండోమెట్రియోసిస్ కణాల వృద్ధిని నియంత్రణలో ఉంచుతాయి. కొందరిలో లాప్రోస్కోపిక్ సర్జరీ అవసరం పడుతుందంటున్నారు నిపుణులు.
News January 5, 2026
ఐఐటీ మండీలో 31 పోస్టులు.. అప్లై చేశారా?

<


