News October 2, 2024

ఖమ్మం: డీఎస్సీ అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

ఖమ్మం నగరంలో డీఎస్పీ-2024 అభ్యర్థులకు 1:3 నిష్పత్తిలో నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ వర్మ తెలిపారు. రిక్క బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రోటరీ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు. ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

వెలుగుమట్లలో బాధితులపై సర్వే కొనసాగుతోంది: కలెక్టర్

image

ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన వారి సామాజిక-ఆర్థిక సర్వే ముమ్మరంగా కొనసాగుతోందని అనుదీప్ దురిశెట్టి శనివారం తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాకు చెందిన 522 మంది, ఇతర జిల్లాలకు 107, ఇతర రాష్ట్రాలకు ముగ్గురిని గుర్తించారు. సర్వే పూర్తయ్యాక అర్హులకు నివాస స్థలం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సంబంధితులు సర్వేకు సహకరించాలని కోరారు.

News February 28, 2026

ఖమ్మం: అదనపు కలెక్టర్‌కు తీన్మార్ మల్లన్న వినతి

image

భూదాన్ భూముల బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు. శనివారం తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తక్షణ సహాయం కింద ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. భూదాన్ భూముల విషయంలో పేదలపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్యాయమని లేఖలో ప్రస్తావించారు.

News February 28, 2026

ఖమ్మం: పేరుకు మాత్రమే పేదల పార్టీ: ఈటల

image

కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.