News October 2, 2024
ఉపవాసం అందరికీ మంచిది కాదు: వైద్యులు

లంకణం దివ్యౌషధం అన్నారు పెద్దలు. అయితే అది అందరికీ వర్తించదంటున్నారు వైద్యులు. థైరాయిడ్ సమస్యలున్నవారు, నెలసరి సక్రమంగా రానివారు, సంతాన సాఫల్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉండేవారు, మధుమేహం ఉన్నవారు ఉపవాసాలకు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. ఉన్న సమస్య పరిష్కారం కోసం ఉపవాసం చేస్తే వీరు లేని సమస్యలు తెచ్చుకునే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News October 25, 2025
ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో AUS 236 రన్స్కు ఆలౌట్ అయింది. 124-2తో పటిష్ఠ స్థితిలో ఉన్న కంగారూలు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. మార్ష్ 41, హెడ్ 29, షార్ట్ 30, రెన్షా 56, క్యారీ 24, కూపర్ 23 రన్స్ చేశారు. మన బౌలర్లలో రాణా 4, సుందర్ 2, సిరాజ్, అక్షర్, ప్రసిద్ధ్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. కాసేపట్లో 237 టార్గెట్తో భారత్ బరిలోకి దిగనుంది. IND వైట్వాష్ నుంచి తప్పించుకుంటుందా? COMMENT
News October 25, 2025
జాగ్రత్త.. పిల్లలకు మేకప్ వేస్తున్నారా?

ప్రస్తుత రోజుల్లో పిల్లలకీ మేకప్ వేయడం సాధారణం అయిపోయింది. స్కూలు ప్రోగ్రాములున్నాయనో, వారు మారాం చేస్తున్నారనో మేకప్ వేస్తున్నారు. కానీ వీటివల్ల తలనొప్పి, త్వరగా నెలసరి రావడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తప్పనిసరి అయితే మైల్డ్వీ, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లిప్ స్టిక్, మస్కారా వంటివి అస్సలు వాడకూడదని చెబుతున్నారు.
News October 25, 2025
SBI క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్న్యూస్

క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీల పెంపునకు SBI సిద్ధమైంది. వీటి ద్వారా వాలెట్లలో రూ.1000 కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే 1% ఛార్జీ పడనుంది. ఎడ్యుకేషన్ ఫీజులను థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లించినా 1% రుసుము విధించనుంది. అయితే స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లు, POS మెషీన్ల ద్వారా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. పెంచిన ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.


