News October 2, 2024
మైలవరం: మాజీ మంత్రి జోగి రమేశ్కు నోటీసులు
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి, మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ జోగి రమేశ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో నేడు హాజరుకావాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News October 2, 2024
కృష్ణా: రేపు టెట్ పరీక్ష రాయనున్న అభ్యర్థులు
కృష్ణా, NTR జిల్లాలలో అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. 2 జిల్లాలలోని 9 కేంద్రాలలో మొత్తంగా 58,089 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు టెట్ పరీక్ష ఆన్లైన్లో జరుగుతోందని చెప్పారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
News October 2, 2024
గాంధీజీ బోధనలు మనకు మార్గదర్శకం: అబ్దుల్ నజీర్
మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన స్మృతికి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ రాజ్భవన్ నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధీజీ చేసిన శాశ్వతమైన బోధనలు మనందరికీ మార్గదర్శకమని, ప్రజలకు స్ఫూర్తినిచ్చే జీవన విధానంగా అహింస మార్గాన్ని ఆయన బోధించారని గవర్నర్ స్పష్టం చేశారు.
News October 2, 2024
కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీపీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.