News October 2, 2024

గుంటూరు: 97.22 శాతం మందికి పింఛన్ల పంపిణీ

image

గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకంలో మొదటి రోజు 97.22 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదు రూ.4వేలు చొప్పున అందజేశారు. జిల్లాలో 2,56,017 మంది పింఛన్ దారులకు రూ.109.19కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. కాగా 2,48,901 మందికి రూ.106.10కోట్లు పంపిణీ చేశారు.

Similar News

News October 2, 2024

వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై కేసు నమోదు

image

వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై గుంటూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అంబటి మురళి, మరో 12 మంది సెప్టెంబర్ 28న పట్టణంలోని శ్రీసహస్రలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిరసన ధర్నా నిర్వహించారు. వైసీపీ నేతలు భక్తులను లోపలకు వెళ్లనివ్వకుండా ధర్నా చేశారని టీడీపీ నాయకుడు నరేశ్ ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసులు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.

News October 1, 2024

గుంటూరు: విజిలెన్స్ ఇన్స్పెక్టర్‌గా చంద్రశేఖర్ బాధ్యతలు

image

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్టర్‌గా కొమ్మాలపాటి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు 3 జిల్లాల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సు‌మెంట్ సీఐగా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన అక్కిశెట్టి శ్రీహరి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన సీఐను కార్యాలయ సిబ్బంది అభినందించారు.

News October 1, 2024

రాజధానిలో రూ.250 కోట్లతో టెక్నాలజీ యూనిట్

image

రాజధాని అమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈఅ టెక్నాలజీ సెంటరును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తర్వులిచ్చింది. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీని సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సీఆర్డీఏ కమిషనరును కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సీఆర్డీఏ పరిధిలోని సుమారు 20ఎకరాల్లో టెక్నాలజీ సెంటరుకు త్వరలో పునాది పడనుంది.