News October 2, 2024
విశాఖ జిల్లాలో 1,58,224 మందికి పెన్షన్ పంపిణీ

విశాఖ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 97.39 శాతం పెన్షన్ లబ్ధిదారులకు అందజేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు 1,58,244 మందికి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో 3వ తేదీన మిగిలిన లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News January 9, 2026
విశాఖ మెట్రోకు మళ్లీ జాప్యం? (1/2)

విశాఖ మెట్రో ప్రాజెక్టు మరోసారి <<18813242>>జాప్యం<<>> దిశగా సాగుతోంది. తాజాగా కేంద్రం ఫీజబులిటీ రిపోర్ట్ సమర్పించాలని కోరడంతో ఆలస్యం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన DPRపై కేంద్రం కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం, నిర్వహణ వ్యయం, బ్రేక్ ఈవెన్ కాలంపై స్పష్టత కోరింది.
News January 9, 2026
విశాఖ మెట్రోకు మళ్లీ జాప్యం? (2/2)

సుమారు రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందిన విశాఖ మెట్రో ప్రాజెక్టులో కేంద్రం, రాష్ట్రం చెరో 20% భరించాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటా నిధుల సమీకరణపై సందేహాలు నెలకొన్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా మెట్రోతో పాటు 12 ఫ్లైఓవర్లు పూర్తైతే నగరానికి ఊరట లభిస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే వేర్వేరు నిర్మాణాల వల్ల ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
News January 9, 2026
విశాఖలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కోరియర్ కార్యాలయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలపై రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


