News October 2, 2024
రంజీకి ఎంపికైన ఆదిలాబాద్ క్రీడాకారుడు
హైదరాబాద్ రంజీ జట్టుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంపికైన తొలి క్రీడాకారుడిగా హిమ తేజ చరిత్ర సృష్టించాడు. ఆదిలాబాద్కు చెందిన హిమ తేజ జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 11, 14 తేదీల్లో డెహ్రాడూన్లో జరిగే రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినధ్యం వహించనున్నాడు.
Similar News
News October 2, 2024
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్గా ఇలంబరితి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్గా రవాణా శాఖ కమిషనర్ ఇలంబరితిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్, మంచిర్యాల జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్గా ఆయన్ను నియమించారు. జిల్లాల్లో పర్యటించడంతో పాటు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు.
News October 2, 2024
ADB: నేటి నుంచి పాఠశాలలకు 13 రోజులు సెలవులు
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. ఈ సెలవులు అక్టోబర్ 14 వరకు వుంటాయని, తిరిగి పాఠశాలలు ఈ నెల 15న తిరిగి ప్రారంభమవుతాయన్నారు. ఈ సెలవు రోజుల్లో ఎవరైనా ప్రైవేట్ క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చురించారు.
News October 1, 2024
ADB: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.