News October 2, 2024
HYD: ‘దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు’

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 14 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 15వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఆదేశాలు పాటించకుండా ప్రత్యేక క్లాసెస్, ట్యూషన్లు వంటివి కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ నిర్వహిస్తే, అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.
Similar News
News January 31, 2026
రంగారెడ్డి: అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

ఈ నెల 15న వరుసగా ఇళ్లల్లో చోరీలు చేసి పరారైన అంతరాష్ట్ర దొంగలను శుక్రవారం మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు DCP సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన మహాదేవ్ ఝా (A-1), పవన్ గుప్తా (A-2), కాన్పూర్కు చెందిన మంగళ్ సింగ్ (A-3)లు బోడుప్పల్ పరిధిలోని 9 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 250 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, రూ.2 లక్షల నగదును దోచుకొని పరారైనట్లు తెలిపారు.
News January 31, 2026
రంగారెడ్డి: అత్యాచారం ఘటనలో 25 సంవత్సరాల జైలు

బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 25 సంవత్సరాలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్కు చెందిన మహమ్మద్ హబీబ్ (53) 2023లో బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో 25 సంవత్సరాలు జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.
News January 31, 2026
రంగారెడ్డి: ఉరేసుకుని సాప్ట్ వేర్ సూసైడ్

ఓ సాప్ట్ వేర్ ఇంజినీరు ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైలార్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరల మేరకు.. వంశీ యాదవ్ (38) భార్య శ్రావ్య, ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి దుర్గాహిల్స్లో కాపురముంటున్నాడు ఉంటున్నారు. ఈ క్రమంలో కుంటుంబంలో కలహాలు ఏర్పాడ్డాయి. మనస్తాపం చెందిన అతను శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


