News October 2, 2024
భారత జట్టుపై రోహిత్ తన ముద్ర వేశారు: మంజ్రేకర్
బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజులే ఆడినా టీమ్ ఇండియా ఫలితం రాబట్టిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే ఆ విజయానికి కారణమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కొనియాడారు. ‘ఈ జట్టుపై రోహిత్ తనదైన ముద్ర వేశారు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం చూడకుండా దూకుడుగా ఆడి మిగిలిన ఆటగాళ్లకు శర్మ ఆదర్శంగా నిలిచారు. రోహిత్ టీమ్నుంచి వెళ్లిపోయాక కూడా ఆయన ప్రభావం ఈ జట్టుపై కచ్చితంగా ఉంటుంది’ అని అన్నారు.
Similar News
News October 11, 2024
స్విగ్గీ బాయ్కాట్ నిర్ణయం వెనక్కి
AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
News October 11, 2024
ఎన్కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ
ఈ నెల 5న ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.
News October 11, 2024
మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ
బంగ్లాదేశ్లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.