News October 2, 2024

కడప: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన కలెక్టర్

image

కడప జిల్లా కేంద్ర కారాగారాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సందర్శించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జైలు జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరూ క్షణిక ఆవేశంలో తప్పులు చేసి ఉంటారని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జైలు జీవితం గడిపేవారు విడుదల అయిన తర్వాత మంచి జీవితాన్ని గడపాలని సూచించారు.

Similar News

News January 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

image

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.

News January 12, 2026

కడప: ఒక MRO సస్పెండ్.. మరో 11 మందికి నోటీసులు

image

రైతులకు పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి కొరడా ఝులిపించారు. ముఖ్యంగా జిల్లా అతి తక్కువగా పాసు పుస్తకాలను పంపిణీ చేసిన తొండూరు MRO రామచంద్రుడు సస్పెండ్ చేశారు. అలాగే చెన్నూరు, పెండ్లిమర్రి, VNపల్లె, గోపవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, B.మఠం, ప్రొద్దుటూరు, CK దిన్నె MROలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

News January 12, 2026

గండికోట ఉత్సవాల్లో పర్యాటక మంత్రి.. ఏం మాట్లాడారంటే.!

image

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం గండికోట ఉత్సవాల్లో పాల్గొన్నారు. గండికోట ఓ వారసత్వ సంపదని మోదీ, CM, DyCm ఇలాంటి కట్టడాల పరిరక్షణకు పెద్దపీట వేశారన్నారు. గండికోట అభివృద్ధికి రూ.78 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో ఈ ప్రాంతంలో హోటల్స్ వెలుస్తాయన్నారు. ఈ ప్రాంత వసతి, సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. గండికోట ఉత్సవ ఏర్పాట్లు చేసిన కలెక్టర్, SP ఇతర జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.