News October 2, 2024
సోషల్ మీడియాలో ఆర్సీబీ సరికొత్త మైలురాయి

సోషల్ మీడియాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త మైలురాయి అందుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఆ జట్టు 15 మిలియన్ల ఫాలోవర్లను చేరుకుంది. సీఎస్కే తర్వాత 15 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న జట్టుగా RCB నిలిచింది. ప్రస్తుతం సీఎస్కేకు 16 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత ముంబై (14.1M) కోల్కతా (6.4M), హైదరాబాద్ (4.4M), రాజస్థాన్ (4.4M), గుజరాత్ (4M), ఢిల్లీ (3.9M) పంజాబ్ (3.3M), లక్నో (3.2M) ఉన్నాయి.
Similar News
News November 10, 2025
మెగాస్టార్ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్!

స్వింగ్ జరా, కావాలయ్యా వంటి సూపర్హిట్ సాంగ్స్తో యూత్ను అట్రాక్ట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు టాక్. ప్రత్యేక సెట్లో సాంగ్ షూట్ చేయడానికి అనిల్ రెడీ అవుతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News November 10, 2025
APPLY NOW: జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలు

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇవాళ్టి వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/
News November 10, 2025
మరో బస్సు ప్రమాదం.. 30 మంది సేఫ్

AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుచేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


