News October 2, 2024
విధుల్లోకి విశాఖ ఉక్కు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
ఇటీవల స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించిన 4,000 మంది ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం కార్మిక శాఖ అధికారి పేరిట ఒక ప్రకటన విడుదలైంది. ఇటీవల స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించిన వారిని యథావిధిగా మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆ ప్రకటనలో అధికారి కోరారు. దీంతో కార్మికుల ఆందోళన కొంత మేరకు ఫలించింది.
Similar News
News October 7, 2024
అనకాపల్లి: కలెక్టరేట్ పరిష్కార వేదికకు 232 అర్జీలు
అనకాపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సంస్థలపై 232 అర్జీలను ప్రజలు అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News October 7, 2024
ఆరిలోవ: పసికందు అదృశ్యం.. కేసు ఛేదించిన పోలీసులు
ఆరిలోవ రామకృష్ణాపురంలో పసికందు అదృశ్యం ఘటనను ఆరిలోవ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఆరిలోవ సీఐ గోవిందరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల వలన పసికందు అమ్మమ్మ వాళ్ల బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రామంలో పసికందును కుక్క లాక్కుని పోయిందని జరిగిన హై డ్రామాకు తెరపడింది.
News October 7, 2024
విశాఖ: ‘ఎమ్మెల్సీ సీటును తూర్పు కాపులకు కేటాయించాలి’
టీచర్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బీసీ తూర్పు కాపులకు కేటాయించాలని ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు గొర్లె శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ అయితే తూర్పు కాపులకు సీటు ఇస్తుందో ఆ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో తూర్పు కాపు సంఘం నాయకులు బలగ సుధాకర్, లోగిస గణేశ్ పాల్గొన్నారు.