News October 3, 2024
మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే: కేటీఆర్

TG: కాంగ్రెస్ అసహ్యకరమైన, వికారం కలిగించే రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపినట్లు X ద్వారా వెల్లడించారు. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు? లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని పేర్కొన్నారు. ‘మీ సీఎం, మంత్రిని మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపండి’ అని రాహుల్ గాంధీకి సూచించారు.
Similar News
News March 19, 2026
హార్ముజ్ ఒక్కటే కాదు..: కేంద్రం

హార్ముజ్పై భారత్ డిపెండెన్సీ తగ్గిందని.. 70% క్రూడ్ ఇతర ప్రాంతాల నుంచి వస్తోందని కేంద్రం తెలిపింది. LPG సరఫరాను వికేంద్రీకరించేందుకు కృషి చేస్తున్నామంది. రెగ్యులర్గా దిగుమతి చేసుకునే ఖతర్తో పాటు ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు పెంచనున్నట్లు తెలిపింది. అవసరమైతే రష్యా నుంచి కూడా LPG కొంటామని పేర్కొంది. మరోవైపు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు టోల్ఛార్జ్ విధించే ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది.
News March 19, 2026
అరుదైన బ్లడ్ గ్రూప్.. 50 మందికి మాత్రమే!

మనందరిలో ప్రధానంగా నాలుగు గ్రూపుల రక్తం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ‘Rh-Null’ అనే విషయం మీకు తెలుసా? దీనినే ‘గోల్డెన్ బ్లడ్’ అని పిలుస్తారు. ఇందులో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు, అందుకే ఈ రక్తం ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ వీరికి రక్తం కావాలంటే మాత్రం దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 19, 2026
జ్యోతిషుడు అరెస్టు.. మహిళలతో 58 అసభ్యకర వీడియోలు

మహారాష్ట్రలో ‘ఎప్స్టీన్ ఫైల్స్’ లాంటి ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్కు చెందిన జ్యోతిషుడు అశోక్ కారత్ తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడని పోలీసులు గుర్తించారు. వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ దోపిడీ చేసేవాడన్నారు. అతడిని అరెస్టు చేసి 58 అసభ్యకర వీడియోలను సీజ్ చేశారు. అశోక్ గతంలో నేవీలో పని చేశాడు. ఇతడికి MH రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నాయి.


