News October 3, 2024
పెరిగిన Gold Loans డామినేషన్
FY25 ఫస్ట్ క్వార్టర్లో NBFCలు పర్సనల్ లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లనే ఎక్కువగా సాంక్షన్ చేశాయని FIDC తెలిపింది. ఇవి YoY 26% పెరిగి రూ.79,218 కోట్లకు చేరాయంది. గత ఏడాది రూ.63,495 కోట్లతో పర్సనల్ లోన్లే టాప్లో ఉన్నాయి. అన్ సెక్యూర్డ్ లోన్లపై RBI గత నవంబర్లో వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడవి రెండో స్థానానికి చేరాయి. హౌసింగ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News October 3, 2024
ఆ ఇళ్లకు నో పర్మిషన్: CM రేవంత్ రెడ్డి
TG: ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు పర్మిషన్ ఇవ్వబోమని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘హైదరాబాద్లో ఒకప్పుడు 200 ఫీట్ల లోపే బోర్ పడేది. ఇప్పుడు 1,200 ఫీట్లు వేసినా లాభం ఉండట్లేదు. ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలిచ్చా. అలాంటి ఇళ్లకు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లిస్తే రెండింతలు అదనంగా వసూలు చేయాలని చెప్పా. నగరాన్ని బాగు చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నా’ అని తెలిపారు.
News October 3, 2024
సద్గురుకు రిలీఫ్: TN పోలీస్ యాక్షన్ అడ్డుకున్న సుప్రీంకోర్టు
మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్పై TN పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు అడ్డుకుంది. HCPని హైకోర్టు నుంచి బదిలీ చేసుకుంది. చర్యలపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది. విచారణను OCT 18కి వాయిదా వేసింది. 5వేల మంది ఉండే ఆశ్రమంలోకి 150+ పోలీసులు వెళ్లారని ఈషా లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. ‘అవును, అలాంటి చోటకు అలా వెళ్లకూడదు’ అని CJI ఏకీభవించారు.
News October 3, 2024
మూసీ నిర్వాసితులకు BRS రూ.500కోట్లు ఇవ్వాలి: CM
TG: BRS పార్టీ అకౌంట్లో రూ.1500కోట్లు ఉన్నాయని, అందులో రూ.500 కోట్లు మూసీ నిర్వాసితులకు ఇవ్వాలని CM రేవంత్ అన్నారు. హైడ్రా విషయంలో ప్రతిపక్షం ఎందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన కేటీఆర్, హరీశ్ రావు, సబిత ఫామ్ హౌస్లను కూల్చాలా? వద్దా? అనే విషయంలో వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు 15వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు.