News October 3, 2024

కామారెడ్డిలో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 133 మంది హాజరు

image

డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 133 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. నిన్న అమావాస్య కావడంతో తక్కువ మంది ధ్రువపత్రాల పరిశీలకు వచ్చినట్లు సిబ్బంది వెల్లడించారు. అలాగే ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని అధికారులు సూచించారు.

Similar News

News January 17, 2026

NZB: 60 డివిజన్లు కాంగ్రెస్, బీజేపీ నుంచి 500 మంది ఆశావహులు

image

NZB కార్పొరేషన్లో పోటీకి వందలాది ఆశావహులు రెడీ అయ్యారు. 60 డివిజన్లలో కేవలం రెండు ప్రధాన పార్టీల్లోనే 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి 300 మంది బీజేపీ నుంచి 200 మంది టికెట్లకు అప్లై చేశారు. ఎవరి రూట్లో వారు టికెట్ల లాబీయింగ్ చేసుకుంటున్నారు. బీజేపీ ఇప్పటికే 14 మందికి మీకే టికెట్ అని సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. రిజర్వేషన్లు రాగానే వారి పేర్లు ప్రకటించే ప్లాన్ చేసింది బీజేపీ.

News January 17, 2026

నిజామాబాద్‌లో సైబర్ మోసం

image

NZB పూసలగల్లి వాసి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.10 లక్షల మోసానికి గురయ్యాడు. లాభాలు గడించే సూచనలు చేసేందుకు రూ.3 వేలు చెల్లించి తమ గ్రూపులో చేరాలని మెస్సేజ్ వచ్చింది. డబ్బులు చెల్లించగా సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్‌కు ఒక QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మెళుకువలు తెలుస్తాయన్నారు. అది స్కాన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News January 17, 2026

NZB: మందుగుండు పేలి ఆవు మృతి

image

వన్యప్రాణుల వేట కోసం దుండగులు వేసిన ఉచ్చు ఒక పాడిఆవు ప్రాణాలను బలితీసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన కారె సాయికుమార్ అనే రైతు తన ఆవును మేత కోసం జాన్కంపేట్ శివారులోకి తీసుకెళ్లారు. అడవిపందుల కోసం పేలుడు మందును పశువులకు పెట్టే తవుడులో ముద్దలుగా చేసి ఉంచారు. మేత మేస్తున్న క్రమంలో ఆవు ఆ తవుడు ముద్దను తినగానే ఒక్కసారిగా నోట్లోనే పేలుడు సంభవించి ఆవు నోటిభాగం తీవ్రంగా ఛిద్రమై మృతి చెందింది.