News October 3, 2024

కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: పురందీశ్వరి

image

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి తెలిపారు. ‘రాజకీయ నాయకులు దేశానికి, రాష్ట్రానికి సేవ చేస్తే, సినీనటులు ప్రజలకు వినోదం అందిస్తారు. ఇతరులను కించపరచకుండా, వారిని గౌరవిస్తే సముచితంగా ఉంటుంది. సినీ, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తిగా, మహిళగా మంత్రి మాటలను ఖండిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 22, 2026

ముగిసిన దావోస్ పర్యటన.. అమెరికాకు CM రేవంత్

image

TG: ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసినట్లు ప్రభుత్వం తెలిపింది. 3 రోజుల WEFలో ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్లు పేర్కొంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని, AI, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ అంశాలపై MoUలు కుదిరాయని వెల్లడించింది. మరోవైపు దావోస్‌లో కార్యక్రమాలు ముగించుకొని CM రేవంత్ <<18905782>>అమెరికా పర్యటన<<>>కు వెళ్తున్నారు.

News January 22, 2026

పడుకునే ముందు నీళ్లు తాగడం మంచిదేనా?

image

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులూ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘శరీర ఉష్ణోగ్రత నియంత్రణతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడి హాయిగా నిద్ర పడుతుంది. శరీరంలోని వ్యర్థాల తొలగింపునకు సహాయపడుతుంది. అయితే ఎక్కువగా తాగితే మాటిమాటికీ మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం వల్ల నిద్రకు భంగం కలగవచ్చు. గుండె, కిడ్నీ సమస్యలున్నవారు నిద్రకు 1-2 Hr ముందే నీళ్లు తాగడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.

News January 22, 2026

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ICC సస్పెండ్ చేయనుందా?

image

T20 WC మ్యాచులు భారత్‌లో ఆడబోమని బంగ్లా క్రికెట్ బోర్డ్ చెప్పడాన్ని ICC సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఆడాల్సిందే అని చెప్పినా వినకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు భావిస్తోంది. విచారణలో ఇదే నిజమని తేలితే BCBని సస్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 7న WC ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే డెసిషన్ తీసుకోనుందని అభిప్రాయపడుతున్నాయి.